ముంబై: కార్పొరేట్ పన్ను తగ్గింపు, జీఎస్టీ మండలి నిర్ణయాల లాంటి సానుకూలతల మధ్య గత వారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు సోమవారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఉదయం 9.42గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 726 పాయింట్ల లాభంతో 38,741వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 226 పాయింట్లు లాభపడి 11,501వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.15 వద్ద కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm