మహారాష్ట్ర: రాష్ట్రంలోని బుల్దానా జిల్లా మాలేగావ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. బావిలో మహిళతో సహా నలుగురు కుమార్తెల మృతిదేహాలను స్థానికులు గుర్తించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm