పశ్చిమ గోదావరి: బోటుప్రమాదంలో మరణించిన మరో మహిళ మృతదేహం పట్టిసీమ వద్ద లభించింది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిన్న లభ్యమైన రెండు మృతదేహాలు గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. బోటుప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. బోటు ప్రమాదంలో మరో 15మంది ఆచూకీ లభించాల్సి ఉంది. బోటుప్రమాదం నుంచి 26 మంది బయటపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm