ముంబై: భారత మాజీ క్రికెటర్ మాధవ్ ఆప్టే(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాధవ్ ముంబైలోని బ్రీచ్ కాండే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారు. 1950వ దశకంలో భారత టెస్టు ఓపెనర్గా సేవలందించిన మాధవ్ ఆప్టే ఏడు టెస్టులు ఆడారు. ఇందులో వెస్టిండీస్పైనే ఐదు టెస్టులు ఆడారు. వెస్టిండీస్ దిగ్గజ బౌలర్లు ఫ్రాంక్ కింగ్, జెర్రీ గోమెజ్, ఫ్రాంక్ వారెల్ వంటి అటాకింగ్ను ఎదుర్కొని రెండు సెంచరీలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm