కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ లో నలుగురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నలుగురు పిల్లలకు పురుగుల మందు తాగించి తల్లి కూడా తాగింది. ఈ ఘటనలో తల్లి వరలక్ష్మి మృతిచెందగా, నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు ఇందు, ఉమాదేవి, ఐశ్వర్య, ఉదయ్ కుమార్ లను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm