హ్యూస్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా వి ద పీపుల్ అనే మూడు పదాలే ప్రధాన అంశంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం ఉభయ తారకంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇంధన భద్రతపై కూడా రెండు దేశాలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరు దేశాలు చేయి చేయి కలిపి ముందుకు సాగితే ప్రపంచం కూడా దేదీప్యమానం అవుతుందన్నారు. అమెరికా అభ్యున్నతిపట్ల ప్రవాస భారతీయుల కృషిని ఆయన ప్రశంసించారు. హ్యూస్టన్లో నిర్వహించిన హౌడీ-మోడీ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించారు. ప్రస్తుతం భారతీయ అమెరికన్ల వెలుగుల్లోనే అమెరికా గొప్పదనం ముడిపడి ఉందని చెప్పారు. అక్కడున్నవారంతా ఇరుదేశాల భవిష్యత్ కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. భారత్తో సంబంధాలను మరింత పటిష్ట పర్చుకుంటామని, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ గొప్పదనాన్ని చాటిచెప్పారు. ఎన్బీఏ బాస్కెట్ బాల్ గేమ్స్ను వచ్చే ఏడాది ముంబయిలో నిర్వహించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm