హైదరాబాద్: కార్మిక సంఘాలతో నేడు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ సమ్మె నోటీసులపై స్పందించిన కార్మికశాఖ ఇవాళ కార్మిక సంఘాలను లేబర్ కమిషనర్ చర్చలకు పిలిచారు. అయితే ఈరోజు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. నిబంధనల మేరకు లేబర్ కమిషనర్కు సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉండగా, యాజమాన్యానికి మాత్రమే నోటీసులు ఇచ్చారు. త్వరలో కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతామని కార్మికశాఖ పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm