హైదరాబాద్: అమీర్పేటలో మెట్రో స్టేషన్ దగ్గర చనిపోయిన మౌనిక మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మౌనిక కుటుంబసభ్యులను కోదండరామ్ పరామర్శించారు. మౌనికది ముమ్మాటికీ మెట్రో, ప్రభుత్వ హత్యేనని కోదండరామ్ పేర్కొన్నారు. మెట్రో అధికారుల నిర్లక్ష్యం వల్లే మౌనిక మృతి చెందిందన్నారు. మౌనిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm