ఢిల్లీ : కాశ్మీర్లో ఉగ్రవాదులు తమకు సహకరించే వారితో కమ్యూనికేషన్ కోల్పోయారని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. కాశ్మీర్ లోయలో ప్రజల మధ్య అనుసంధానానికి ఇబ్బందులు లేవని, కమ్యూనికేషన్ వ్యవస్థ బాగానే పని చేస్తోందని ఆయన చెప్పారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న వారిపట్ల ఏం చేయాలో తమకు తెలుసునని ఆయన అన్నారు. అటువంటివారిపై ఎలా ప్రతిస్పందించాలో తమ దళాలకు తెలుసునని ఆయన చెప్పారు. తాము అప్రమత్తంగా ఉన్నామని, అనేక చొరబాట్లను నిలువరించామని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm