చెన్నై: బాలాకోట్ మళ్లీ పుంజుకున్నది. అక్కడ సుమారు 500 ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ఇవాళ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పుల్వామా దాడి తర్వాత భారత దళాలు పాక్లోని బాలాకోట్ ఉగ్రస్థావరాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే అదే స్థావరం వద్ద మళ్లీ ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను పునరుద్దరించినట్లు ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. బాలాకోట్ స్థావరంపై మరోసారి సర్జికల్ దాడి చేసినా ఆశ్చర్యం లేదని రావత్ తెలిపారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, బాలాకోట్ దాడి కన్నా మరింత బలమైన సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సుమారు 500 మంది ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్టన్లు ఆయన తెలిపారు. కశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వ్యాలీలో ఉగ్రవాదులు అల్లర్లు సృష్టించాలనుకుంటున్నారన్నారు. కశ్మీర్లో విధించిన ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm