న్యూఢిల్లీ: చమురు ధరలపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. చమురు ధరల్లో తగ్గుదల ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సౌదీలో రాజకీయ, భౌగోలికంగా ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు లేకపోతే పెట్రోల్ ధరల్లో పెరుగుదల ఉండదన్నారు. న్యూఢిల్లీలో జరిగిన పారిశ్రామిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కంపెనీపై తిరుగుబాటుదారులు దాడి అనంతరం పెట్రోల్ ధరలు అమాంతం 19శాతం పెరిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న చమురు ధరలు.. భారత్ను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. పెట్రోల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో అతిపెద్ద దేశం. చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆ ప్రభావం నిత్యవస్తువుల ధరలపై పడే అవకాశం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Sep 23,2019 12:58PM