హైదరాబాద్: మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక హిల్స్ ఫేస్-11 కాలనీలో మూడు ఇళ్లల్లో చోరీ జరిగింది. కాలనీలోని ఓ ఇంట్లో 14వేల రూపాయల నగదు, 13 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన దొంగలు, మరో రెండు ఇళ్లల్లో 2 సెల్ఫోన్స్ చోరీ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ మధ్య దొంగలు ఆగడాలు ఎక్కువయ్యాయనీ, వాళ్లను ఖచ్చితంగా పట్టుకొని కటకటాల వెనకకు నెడతామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm