తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్లో తొలి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో... అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణ నిదుల కుదింపు ఆంశంపై చర్చించనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వార విఐపి బ్రేక్ దర్శనాలపై , 100 కోట్లతో తిరుపతిలో హాస్టల్ నిర్మాణంపై బోర్డు ఆమోదం తెలపనుంది. 79 కోట్లతో తిరుమలలో యాత్రికుల వసతి సముదాయం-5 నిర్మాణానికి అమోదం తెలపనుంది. తిరుపతిలోని గరుడ వారధి నిర్మాణానికి 100 కోట్లు నిధుల కేటాయింపు అమోదం తెలపనున్న బోర్డు, శ్రీవారి ప్రసాదం ముడిసరుకుల కొనుగోలు అంశంపై చర్చించనున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించి పాలకమండలి సభ్యుల అభిప్రాయాలు సలహాలు తీసుకుంటున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm