గుహవాటి : అసోంలోని సిబ్సాగర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. డిమోవ్లోని జాతీయ రహదారి -37పై ఓ ప్రయివేటు బస్సు.. టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm