హైదరాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సకాలంలో యూరియా అందటం లేదంటూ రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm