హైదరాబాద్ : గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల్లో 90% మన వాళ్లకేనన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్య తీసుకోవాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందిస్తూ గ్రామ సచివాలయ పోస్టులూ ఎక్కువ శాతం మనవాళ్లకే అన్నారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి పైన సుమోటో కేస్ రిజిస్టర్ చెయ్యాలన్నారు. వాలంటీర్ల ఉద్యోగాల్లో 90% మన వాళ్ళకే, గ్రామ సచివాలయ పోస్టులు కూడా ఎక్కువ శాతం మనవాళ్లకే అన్న ఆయనపై చర్య తీసుకోవాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm