అమరావతి: గ్రామ సచివాలయ అభ్యర్ధుల మెరిట్ జాబితా సిద్ధం చేసినట్లు పంచాయతీ రాజ్శాఖ కమిషనర్ గిరిజ శంకర్ వెల్లడించారు. జిల్లాల వారీగా అన్ లైన్లో మెరిట్ లిస్ట్ పెట్టినట్లు చెప్పారు. రోస్టర్, రిజర్వేషన్లు ఆధారంగా మోరిట్ లిస్ట్ తయారు చేశామని, రేపటి (మంగళవారం) నుంచి జిల్లాల్లో అభ్యర్ధుల ఒరిజనల్ సర్టిఫికేట్లు పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులు అన్లైన్లో కాల్ లేటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27 నుంచి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీచేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm