హైదరాబాద్: 71వ ఎమ్మీ అవార్డులను ఇవాళ ప్రదానం చేశారు. కామెడీ షో ఫ్లీబ్యాగ్ రచయిత, నటి ఫోబో వాలర్ బ్రిడ్జ్ మూడు అవార్డులను గెలుచుకున్నది. కిల్లింగ్ ఈవ్ షోలో నటించే జోడీ కామర్కు ఉత్తమ నటి అవార్డు దక్కింది. టీవీ ప్రోగ్రాముల్లో ఉత్తమ నటులకు ఇచ్చే ఎమ్మీ అవార్డుల కార్యక్రమం లాస్ ఏంజిల్స్లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో జరిగింది. ఫోబో వాలర్ బ్రిడ్జ్.. బెస్ట్ లీడింగ్ కామెడీ యాక్ట్రెస్, బెస్ట్ కామెడీ సిరీస్, బెస్ట్ కామెడీ రైటింగ్ అవార్డులను గెలుచుకున్నది. అయితే అతి ప్రతిష్టాత్మకమైన బెస్ట్ డ్రామా అవార్డును మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ సొంతం చేసుకున్నది. ప్రస్తుతం గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎమిదవ సిరీస్ నడుస్తోంది. ఈ షోపై మిశ్రమ స్పందన వస్తున్నా.. ఎమ్మీ అవార్డుల్లో మాత్రం 8 ప్రైజ్లను ఎగురేసుకుపోయింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నటించిన ఫ్యాంటసీ స్టార్ పీటర్ డింక్లేజ్కు బెస్ట్ సపోర్టింగ్ డ్రామా యాక్టర్ అవార్డు దక్కింది.
Mon Jan 19, 2015 06:51 pm