న్యూఢిల్లీ: ఇండియాలో అంతా బాగుందంటూ హ్యూస్టన్లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీ పేర్కొనడంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాలు కోల్పోతుండటం, తక్కువ వేతనాలు, సామూహిక హింసాకాండ, కాశ్మీర్ మూసివేత, విపక్ష నేతలను జైళ్లలోకి పంపడం మినహా ఇండియా అంతా బాగుంది అంటూ దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఏకరవు పెట్టారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న చిదంబంరం తన ట్విట్టర్ ఖాతాలో ఈ వ్యాఖ్యలు చేశారు. హౌడీ మోడీ కార్యక్రమంలో మోడీ తొలుత తెలుగులో మాట్లాడారు. హౌడీ మోడీ అని మీరు అడిగారు కాబట్టి నా స్పందన ఏమిటంటే ఇండియాలో అంతా బాగుంది అని మోడీ అన్నారు. పంజాబీ, గుజరాతీ, బెంగాల్ సహా 8 భాషల్లో మోడీ మాట్లాడారు. అంతా బాగుంది వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి.
Mon Jan 19, 2015 06:51 pm