నల్లగొండ: సీఎం కేసీఆర్కు నల్లగొండపై ఎనలేని ప్రేమ ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఉమ్మడి నల్లగొండకు రెండు మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్ కూడా ఇచ్చారని అన్నారు. సోమవారం నల్లగొండలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. యాదాద్రి టెంపుల్ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. చౌటుప్పల్ శివారులో ఇండస్ట్రియల్ పార్కును త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. పానగల్ రిజర్వాయర్కు రూ.35 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందరం రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం కృషి చేద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm