హైదరాబాద్ : అమీర్ పేట్ మెట్రో రైల్వేస్టేషన్ ఆవరణలో పైకప్పు పెచ్చులూడిన ఘటనలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో మెట్రో స్టేషన్ పైకప్పు పరిస్థితి ఇదేమాదిరి ఉంది. రసూల్ పురా మెట్రోస్టేషన్ పైకప్పు పెచ్చులూడే దశలో ఉంది. దీంతో, ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై మెట్రో అధికారులు స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm