హైదరాబాద్: టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం నూతనంగా రూ.599 ప్లాన్ను ఇవాళ ప్రవేశపెట్టింది. ఇందులో రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే భారతీ ఆక్సా నుంచి రూ.4 లక్షల విలువ గల ఉచిత లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 84 రోజులుగా నిర్ణయించారు. అయితే ఆ వాలిడిటీ అయిపోయాక మళ్లీ ఇదే ప్లాన్ను రీచార్జి చేసుకుంటే సదరు ఇన్సూరెన్స్ అలాగే కొనసాగుతుంది. 18 నుంచి 54 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారికి ఆ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ కేవలం తమిళనాడు, పాండిచ్చేరి ఎయిర్టెల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే దేశ వ్యాప్తంగా ఈ ప్లాన్ను పలు సర్కిళ్లలో ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు అందివ్వనుంది.
Mon Jan 19, 2015 06:51 pm