న్యూఢిల్లీ: గోవుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులపై అమానవీయంగా గోరక్షకులు మూడదాడి చేశారు. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జార్ఖండ్లోని కర్ర ప్రాంతంలో ఆదివారం ఈ సంఘటన జరిగినట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోంకార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు కర్ర పోలీసులకు మూకదాడి సంఘటన గురించి వివరించారు. కొంత మంది ముగ్గురు వ్యక్తుల్ని విపరీతంగా కొడుతున్నారని, ఎందుకని అడిగితే ఆవుల్ని దొంగిలించారాని సమాధానం చెప్పారని పోలీసులకు సమాచారం అందించారు. మేం వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాం. గ్రామస్థులు చెప్పినట్టుగానే ముగ్గురు వ్యక్తులు రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే వారిని రిమ్స్కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఒక వ్యక్తి మృతి చెందాడు. మిగతా వారు కోలుకుంటున్నారు అని డీఐజీ హోంకార్ పేర్కొన్నారు. దాడికి సంబంధించి ఐదుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని, గ్రామ పరిసరాల్లోని అనుమానితులను విచారిస్తున్నామని హోంకార్ తెలిపారు. త్వరలోనే కేసు పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm