హైదరాబాద్: కృష్ణానది కరకట్టపై నిర్మాణాల కూల్చివేతపై సీఆర్డీఏ వివరణ ఇచ్చింది. ఉండవల్లి కరకట్ట వెంబడి మొత్తం 24 అక్రమ కట్టడాలకు నోటీసులిచ్చామని సీఆర్డీఏ పేర్కొంది. వారిలో ఐదుగురు యజమానులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. వివరణ సంతృప్తికరంగా లేని యజమానుల ఇళ్లను కూల్చేయాలని నిర్ణయించామని సీఆర్డీఏ పేర్కొంది. ఇవాళ పాతూరి కోటేశ్వరరావు ఇంట్లో అక్రమ నిర్మాణం కూల్చేశామని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm