హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. బ్రాహ్మణతర్ల గ్రామంలో శ్మశానానికి రోడ్డులేక పొలం గట్లపై మృత దేహాన్ని తీసుకువెళ్లారు. తుంగన పారమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. పారమ్మకు బంధువులు చాలామంది ఉన్నారు. కానీ ఆమె పాడెను మోసేందుకు మాత్రం అవకాశం లేదు. శ్మశానానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో పొలం గట్టుపై నుంచి పాడెను మోస్తూ ఇద్దరే శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. తమ గ్రామంలో శ్మశానానికి రహదారి వేయాలని అధికార్లను ఎన్నిసార్లు కోరినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm