హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, సీఎం కేసీఆర్ లు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసిన కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికారు. కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేత వినోద్ తదితరులు ఉన్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm