నల్లగొండ : నిడమనూరు మండలం పార్వతీపురంలో దారుణం జరిగింది. బీరు సీసా పగులగొట్టి తల్లి ఇట్టే కిట్టమ్మ(65) గొంతులో పొడిచాడు కుమారుడు సూరిబాబు. కిట్టమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కిట్టమ్మపై కుమారుడు సూరిబాబు దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే సూరిబాబు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm