హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన పరిస్థితితులు ఉన్నాయని, పర్యావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉందని తె లంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కెజోషి అన్నారు. భారత, అమెరికా దేశాల మధ్య ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం కొనసాగాలని అన్నారు. సోమవారం బిఆర్కెఆర్ భవన్లో అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్రీఫ్మన్ సీఎస్ జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారిద్దరు వివిధ అంశాలపై సమావేశయ్యారు. ఈసందర్భంగా సీఎస్ జోషి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేకించి సాగునీటి రంగం పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. విద్య, వైద్య , ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తదితర రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోవడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జోషి పేర్కొన్నారు. విద్యార్ధులకు ఏమైనా సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించాలని కోరారు. యుఎస్ కాన్సులేట్ జనరల్ జోయల్రీఫ్మన్ మాట్లాడుతూ తెలంగాణ, అమెరికాల స్నేహ మైత్రి మరింత పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, యుఎస్ కాన్సులేట్ బిల్డింగ్ నిర్మాణ పరిస్థితి పై కూడా ఇరువురు చర్చించారు.
Mon Jan 19, 2015 06:51 pm