హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, విభజన అంశాలతో పాటు గోదావరి, కృష్ణా జలాల సంపూర్ణ వినియోగంపై భేటీలో చర్చించనున్నారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థలపై సీఎంలు చర్చలు జరపనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm