హైదరాబాద్ : గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనలో పోలీసు శాఖ తప్పేమీ లేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక మరిన్ని వివరాలు చెబుతామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ షిమోషీ బాజ్పాయ్తో కలిసి ఆయన మాట్లాడారు. దర్యాప్తు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని అస్మి స్పష్టం చేశారు. బోటు ప్రమాదం మృతుల కుటుంబీకులకు ప్రభుత్వ సాయానికి అదనంగా రూ.10లక్షల బీమా సహాయాన్ని కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. దీనికోసం రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం వద్ద బీమా సహాయకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm