లఖ్నవూ: ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ నేత, ఎమ్మెల్యే సురేంద్ర సింగ్పై సోమవారం కేసునమోదైంది. ప్రభుత్వ అధికారుల్ని ఆయన బెదిరిస్తున్నారని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర విద్యుత్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి సురేంద్ర సింగ్పై ఫిర్యాదు చేశారు. సురేంద్ర సింగ్, బరియా నియోజకవర్గం నుంచి ఉత్తరప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. ఎప్పుడూ కాంట్రవర్సీ వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటుంటారు. అయితే తాజగా ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సరైన ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm