హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఈరోజు సమావేశమై.. యురేనియం తవ్వకాలు, జల సంరక్షణపై చర్చించారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని రాజేంద్రసింగ్ చెప్పినట్టు సమాచారం. యురేనియం తవ్వకాలను నిరసిస్తూ నిర్వహించే ఏ సమావేశంలోనైనా పాల్గొంటానని ఆయన చెప్పారు. నదులు, చెరువులు కలుషితం అవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని విమర్శించారు. కాగా, నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పవన్ కల్యాణ్ నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యావరణవేత్త రాజేంద్రసింగ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm