హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివారులో దొంగలు బీభత్సం సృష్టించారు. దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ నగల దుకాణంలో చోరీ చేసేందుకు దొంగలు యత్నించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని దొంగలను అడ్డుకోబోయారు. ఈ క్రమంలో దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డి పైకి దొంగలు కారు ఎక్కించే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో ఎస్ఐకి ప్రమాదం తప్పింది. పోలీసుల నుంచి తప్పించుకున్న దొంగలు దూలపల్లి ఫారెస్ట్లోకి పరారీ అయ్యారు. దొంగలు ప్రయాణించిన కారును, కట్టర్, షెట్టర్ తెరిచేందుకు ఉపయోగించే సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ఉపయోగించిన కారును అల్వాల్లో చోరీ చేశారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm