హైదరాబాద్: తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కేసీఆర్ కు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రాన్ని ఏపీ సీఎం జగన్ అందజేశారు. కేసీఆర్ తన కుటుంబంతో పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు. కాగా, హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో కేసీఆర్, జగన్ ల భేటీ కొనసాగుతోంది. గోదావరి జలాలు, విభజన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. రాజకీయ అంశాల గురించీ వారు ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm