హైదరాబాద్ : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆమె రాష్ట్రపతి భవన్లో కోవింద్తో సమావేశమయ్యారు. తెలంగాణలోని పరిస్థితులను రాష్ట్రపతికి తమిళిసై వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాతోనూ ఆమె భేటీ కానున్నారు. మంగళవారం హరియాణాలో జరగనున్న గవర్నర్ల ఉపసంఘం సమావేశానికి తమిళిసై హాజరుకానున్నారు. ఆ తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm