సూర్యాపేట: హుజూర్నగర్లో 30 వేల మెజార్టీతో గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని, మంత్రి జగదీశ్రెడ్డి హుజూర్నగర్కు ఒక్క రూపాయి పనిచేయలేదని ఆరోపించారు. ఉప ఎన్నిక భయంతోనే రైతుబంధు డబ్బులు విడుదల చేశారని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని ఉత్తమ్ విమర్శించారు. మహాభారతంలో కురుక్షేత్రంలా హుజూర్నగర్ ఉప ఎన్నిక జరుగుతుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య మహాసంగ్రామమన్నారు. వందమంది కౌరవులు పాండవుల మీద యుద్ధం చేసినట్లు హుజూర్నగర్కు వందల మంది టీఆర్ఎస్ నేతలు రానున్నారని మల్లురవి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm