హైదరాబాద్ : కెన్యా రాజధాని నైరోబీలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రీసియస్ టాలెంట్ టాప్ స్కూల్ (ప్రాథమిక పాఠశాల) మొదటి అంతస్థు పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా..64 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు నైరోబీ విద్యాశాఖ కార్యదర్శి జార్జ్ మగోహా వెల్లడించారు. పాఠశాలను ఎక్కువగా కలపతో నిర్మించగా..పాఠశాల భవనం నిర్మాణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జార్జ్ చెప్పారు. ఘటనాస్థలాన్ని వందల సంఖ్యలో జనాలు చుట్టముట్టారు. పుస్తకాలు, ఫర్నిచర్, కుర్చీలు భవనశిథిలాల కింద ఉండిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm