న్యూఢిల్లీ: పసిడి ధర సోమవారం స్వల్పంగా పెరగ్గా, వెండి ధర భారీగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం బంగారం ధర పది గ్రాములకు రూ.130 పెరిగి రూ.38,690కి చేరుకుంది. వెండి కిలోకు ఏకంగా రూ.900 పెరిగి రూ.47,990గా నమోదైంది. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.38,560 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. న్యూయార్క్లో ఔన్సు బంగారం ధర 1,518 డాలర్లకు పెరిగింది. వెండి ధర 17.87 డాలర్లుగా నమోదైంది. ఇక, అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీన పడి రూ.71.03గా నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm