హైదరాబాద్ : టీమిండియాతో తొలి టెస్టు కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు విశాఖపట్నం చేరుకుంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టు అక్టోబరు 2 నుంచి విశాఖ వేదికగా జరగనుంది. బెంగళూరులో టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం సఫారీలు వైజాగ్ పయనమయ్యారు. విశాఖలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది. కాగా, టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ ను గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా ఈ సిరీస్ ను 1-1తో సమం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm