న్యూఢిల్లీ: ఢిల్లీ ఏరోసిటీ వేదికగా ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ -2019 సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు నేటి నుంచి మూడు రోజుల పాటు కొనసాగనుంది. సదస్సును కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రారంభించారు. 5జీ టెక్నాలజీ, ఫైబర్నెట్, డిజిటల్ పరిజ్ఞానంలో మార్పులపై సెమినార్లు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి పలు మొబైల్, అనుబంధ రంగాల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ప్రముఖ టెలికాం కంపెనీలు, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm