కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ లోని అల్దీ ప్రాంతంలో ఉన్న కుల్తీ బొగ్గు గనిలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నలుగురు వ్యక్తుల అక్రమంగా బొగ్గును తవ్వేందుకు గనిలో దిగారు. అనంతరం బొగ్గు తవ్వుతుండగా విష వాయువు వెలువడింది. దీంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఒక్కరు మాత్రమే బయట పడ్డారు. మిగిలిన ముగ్గురు అందులోనే చిక్కుకున్నట్టు తెలిపారు. విష వాయువు వెలువతుండటంతో రెస్య్కూ టీం బొగ్గు గనిలోనికి వెళ్లలేకపోయినట్టు అధికారులు తెలిపారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.