హైదరాబాద్ : న్యాయవాదులకు రూ.5వేల ఆర్థికసాయం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు మంత్రివర్గ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్ సబ్సిడీని పెంచుతున్నట్లు మంత్రి నాని తెలిపారు. వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకానికి రూ.216కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm