న్యూయార్క్: దేశీయ బ్యాంకింగ్ రంగ పరిస్థితి మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హయాంలోనే దిగజారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. వాళ్లు సృష్టించిన సమస్యల్ని పరిష్కరిస్తూ.. బ్యాంకింగ్ వ్యవస్థకు జీవంపోసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అమెరికాలో ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ మంగళవారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్ హయాంలోనే విపరీతంగా రుణాలు మంజూరు చేశారన్నారు. కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో కేవలం ఫోన్కాల్స్ ఆధారంగా అప్పులు ఇచ్చేశారని ఆరోపించారు. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి.. నిధుల కోసం నేడు ప్రభుత్వం వైపు చూడాల్సిన దుస్థితి తలెత్తిందన్నారు. దేశంలో అధికారం కొంతమంది నాయకుల వద్దే కేంద్రీకృతమైందన్న రాజన్ వ్యాఖ్యల్ని కూడా ఆమె తప్పుబట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm