హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ఉద్యోగ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఆ సంఘం (టీయీఏ) అధ్యక్షుడు సంపత్కుమార్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య ఎంతో విచారకరమన్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాటాలతో హక్కులను సాధిద్దామన్నారు. ఉపాధ్యాయ, ఇతర ఉద్యోగ సంఘాలను ఏకం చేసి పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ నెల 19న రాష్ట్రబంద్కు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm