న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులపై ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్ర, రాష్ట్ర (జమ్మూ కశ్మీర్) ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ అంశంపై వేసిన పిటిషన్ను బుధవారం విచారణకు తీసుకున్న సుప్రీం ధర్మాసనం కశ్మీర్లో యువత నిర్భంధంపై పౌరహక్కులు కుదించడంపై ఇరు ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీసింది. అసిఫా ముబీన్ అనే వ్యక్తి కశ్మీర్ విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కశ్మీర్లో యువతను అక్రమంగా నిర్భంధించారని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయమై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కేవలం ఐదు నిమిషాల్లో అఫిడవిట్ ఇవ్వాలని ధర్మాసనం పేర్కొంది. అనంతరం, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహ్తా మాట్లాడుతూ కశ్మీర్ అంశంలో తానూ జోక్యం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ ఆదేశాలను పిటిషనర్లకు చూపించకూదనుకుంటే కనీసం కోర్టుకైనా చూపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది హుజేఫా అమ్మదీ కోర్టుకు విన్నవించారు.
Mon Jan 19, 2015 06:51 pm