కర్నూలు : కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఓ యువకుడి పై మరో వర్గం రాడ్లు, రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు సినిమా ఫక్కీలో దాడి చేసిన వారిని వెంటాడి పట్టుకున్నారు. యువకుడిపై దాడికి తెగబడిన సమయంలో ఆస్పత్రి సెక్యూరిటీ అక్కడే ఉన్నప్పటికీ చోద్యం చూసారు తప్ప ఆపలేదు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm