ముంబై: క్రికెట్లో ముంబై యువ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ మ్యాచ్లో ద్విశతకం బాదిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఝార్ఖండ్తో మ్యాచ్లో యశస్వి ఈ ఘనత అందుకున్నాడు. కేవలం 154 బంతుల్లో 17ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగి 203 పరుగులు సాధించాడు. ప్రస్తుతం యువ క్రికెటర్ వయస్సు 17ఏండ్ల, 292 రోజులు. ఈ ఏడాది ఆరంభంలోనే జైశ్వాల్ లిస్ట్-ఏ మ్యాచ్ల్లోకి అరంగేట్రం చేశాడు. సూపర్ఫామ్లో ఉన్న అతడు పరుగుల వరద పారిస్తున్నాడు. యువ సంచలనం ఇప్పటికే కేరళ, గోవా జట్లపై రెండు శతకాలు బాదేశాడు. భారత్ అండర్-19 జట్టుకు కూడా జైశ్వాల్ ప్రాతినిధ్యం వహించాడు. గతంలో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గోవాతో మ్యాచ్లో 212 పరుగులు చేసి నాటౌట్ నిలిచిన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ ఇదే కాగా.. అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm