బాలాసోర్: ఒడిశా ఎక్సైజ్ శాఖ అధికారులు భారీ మొత్తంలో బ్రౌన్ షుగర్ను సీజ్ చేశారు. బాలాసోర్ జిల్లా జలేశ్వర్లోని సెక్బాడీ ఏరియాలో ఉన్న ఓ ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేపట్టారు. ఇంట్లో 305 గ్రాముల బ్రౌన్ షుగర్ను గుర్తించి సీజ్ చేశారు. మార్కెట్లో దీని విలువ రూ.35 లక్షలుంటుందని అధికారి ఒకరు తెలిపారు. సపన్ ప్రదాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. సపన్ ప్రదాన్ నార్కోటిక్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అధికారి ఒకరు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm