ఢిల్లీ: పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్(పీఎంసీ) అవకతవకలపై దాఖలైన పిల్పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. పీఎంసీ బ్యాంకులో పొదుపు చేసుకున్న 15లక్షల మందికిపైగా వినియోగదారులకు రక్షణ కల్పించాలని. వారి సొమ్ముపై పూర్తి బీమా కల్పించాలని కోరుతూ బిజోన్ మిశ్రా అనే వ్యక్తి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా విచారించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అక్టోబర్ 18న దీనిపై విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.
ఇప్పటికే బ్యాంకులో దాచుకున్న రూ.90లక్షలు తిరిగి రావన్న ఆవేదనతో జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగి ఒత్తిడికిలోనై గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రూ.కోటి డిపాజిట్ చేసిన ఒక మహిళా డాక్టర్ కూడా ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 04:00PM