న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆకలి సూచీ (జీహెచ్ఐ)లో భారత దేశం అట్టడుగున ఉండటంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలు తగ్గించి, బాలలపై ఎక్కువ దృష్టి పెట్టాలని హితవు పలికింది. జీహెచ్ఐలో భారత దేశానికి 102వ ర్యాంక్ వచ్చిన సంగతి తెలిసిందే. 117 దేశాల్లో జరిగిన అధ్యయనంలో భారత దేశం పాకిస్థాన్ కన్నా వెనుకబడింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయాలు తగ్గించి, బాలలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. మోడీ జీ, రాజకీయాలపై తక్కువగా, మన బాలలపై ఎక్కువగా దృష్టి పెట్టండి. వాళ్ళు మన భవిష్యత్తు. భారత దేశం అంతర్జాతీయ ఆకలి సూచీలో దిగజారింది. 2010 : 95వ ర్యాంక్, 2019 : 102వ ర్యాంక్ అని కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm